కూతురు నిలువెత్తు బంగారాన్ని కట్నంగా..

కూతురు నిలువెత్తు బంగారాన్ని కట్నంగా..

పెండ్లిలలో ఆడవాళ్లు బంగారంతో చేసిన ఆభరణాలు ధరించి అందంగా ముస్తాబవుతారు. పెళ్లి కూతురుకు కానుకగా కొంత బంగారాన్ని ఇస్తుంటారు. అయితే, వదువుకు కట్నంగా నిలువెత్తు బంగారాన్ని ఇవ్వడం ఎప్పుడైనా చూశారా! అదే జరిగింది. పెళ్లి వేదికపై పెళ్లి కూతురు కట్నంగా నిలువెత్తు బంగారాన్ని ఇచ్చాడో తండ్రి. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఓ పాకిస్తానీ వ్యాపారవేత్త తన కూతురు వివాహాన్ని దుబాయ్ ఘనంగా జరిపించాడు. అందులోనే పెళ్లి కూతురు పెద్ద త్రాసుపై కూర్చోగా తన బరువుకు సమానంగా బంగారు బిస్కెట్లని త్రాసులో ఉంచారు. ఈ వీడియోపై స్పందిచిన కొందరు నెటిజన్లు.. పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టైంలో వ్యాపారవేత్తలు ఈ విధంగా డబ్బును వృధా చేస్తున్నారంటూ కామెంట్స్ పెట్టారు. అయితే, తర్వాత ఆ బంగారు బిస్కెట్లన్నీ నకిలీవని జోధా అక్బర్ సినిమా నుంచి తీసుకున్న కాన్సెప్ట్ తో ఈవెంట్ మేనేజర్లు ఈ విధంగా ప్లాన్ చేశారని తెలిసింది.