భద్రాచలంలో ‘లా’ కాలేజీ ఏర్పాటు చేయాలి : పాయం సత్యనారాయణ

భద్రాచలంలో ‘లా’ కాలేజీ ఏర్పాటు చేయాలి : పాయం సత్యనారాయణ

భద్రాచలం, వెలుగు:  జీవో నంబర్​3కు బదులుగా కొత్త జీవోను తీసుకొచ్చి చట్టం చేయాలని, భద్రాచలంలో  లా కాలేజీని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో శనివారం భద్రాచలం ఐటీడీఏ ఎదుట గోండ్వానా సంక్షేమ పరిషత్​ ధర్నా నిర్వహించింది.  ఐటీడీఏ పీవో బి. రాహుల్​కు వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ..  5వ షెడ్యూల్​ ఏరియాలలో ఉన్న ఆదివాసీ నిరుద్యోగులు పదేళ్లుగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.  

 ప్రభుత్వాలు మారినా ఆదివాసీల తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ ఎమ్మెల్యేలు దృష్టి సారించి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్​ చేశారు.  భద్రాచలం కేంద్రంగా ఆదివాసీలకు లా కాలేజీని ఏర్పాటు చేయాలని కోరారు.  ధర్నాకు ఆదివాసీ ఐకాస రాష్ట్ర నాయకులు వాసం రామకృష్ణదొర, మాజీ సర్పంచ్ పడిగె ప్రశాంత్​, మాజీ జడ్పీటీసీ గుండు శరత్​, రాష్ట్ర కార్యదర్శి గుణసాయి తదితరులు సంఘీభావం పలికారు.