కొత్తగా ఇల్లు కొనేవారికి గుడ్‌న్యూస్

కొత్తగా ఇల్లు కొనేవారికి గుడ్‌న్యూస్

కొత్తగా ఇల్లు కొనేవారికి బడ్జెట్‌లో శుభవార్త చెప్పారు. ఆఫర్డబుల్ హౌజింగ్‌కు ట్యాక్స్ హాలిడే ప్రకటిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అదేవిధంగా మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే వారికి వడ్డీ తగ్గింపు పథకాన్ని కంటిన్యూ చేస్తామని ఆమె తెలిపారు.

ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఈసారి బడ్జెట్‌ను డిజిటల్‌గా ప్రవేశపెట్టారు. బండెడు బడ్జెట్ పుస్తకాలకు బదులుగా.. అంతా ఆన్ లైన్‌లోనే.. అదికూడా ఒక యాప్‌లోనే రిలీజ్ చేశారు. దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం నిర్మలకు ఇది వరుసగా మూడోసారి కాగా.. మోడీ ప్రభుత్వానికి తొమ్మిదో బడ్జెట్ కావడం విశేషం. కరోనా వల్ల దేశ ఎకానమీ మొత్తం గాడితప్పింది. కరోనా తర్వాత వస్తున్న బడ్జెట్ కావడంతో దేశం యావత్తు బడ్జెట్ మీద ఆశలు పెట్టుకుంది.