
హైదరాబాద్: విజయవాడ రూట్లో ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రత్యేక రాయితీలను ప్రకటిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. లహారి- నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం, రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం (ఫిబ్రవరి 19) ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ప్రయాణికులకు సూచించింది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.in అధికారిక వెబ్సైట్ని సందర్శించాలని సూచించింది. ఈ విషయాన్ని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వెల్లడించారు. విజయవాడ రూట్లో ప్రయాణించే వారికి టికెట్లపై ఆర్టీసీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
తెలంగాణలోనే రెండో అతిపెద్దదైన గొల్లగట్టు జాతర సూర్యాపేటలో ఘనంగా జరుగుతోంది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు ఈ జాతరకు వెళ్లే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. అలాగే.. ఈ నెల 26న శివరాత్రి పండుగ నేపథ్యంలో హైదరాబాద్లో ఉండే వారు సొంతూర్లు వెళ్లే అవకాశం కూడా ఉండటంతో ఆర్టీకి లాభం రానుంది. భారీగా పెరిగి బస్ టికెట్ ధరలతో అల్లాడిపోతున్న ప్రయాణికులు టీజీఎస్ ఆర్టీసీ డిస్కౌంట్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ రూట్లో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్!!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 19, 2025
హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రత్యేక రాయితీలను #TGSRTC యాజమాన్యం ప్రకటించింది.
లహారి- నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం, రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్ల… pic.twitter.com/KpjA2rwC3J