ట్రాక్టర్ను ఢీకొట్టిన రైలు..తప్పిన పెను ప్రమాదం

 ట్రాక్టర్ను ఢీకొట్టిన రైలు..తప్పిన పెను ప్రమాదం

ఒడిశా రైలు ప్రమాదం తర్వాత దేశ వ్యాప్తంగా వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో గూడ్స్  ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఆరుగులు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

ఏం జరిగిందంటే..

జూన్ 24వ తేదీ శనివారం తెల్లవారుజామున బన్సీ పహార్ పూర్- రుబ్బాస్ రైలు ట్రాక్ లోని లెవల్ క్రాసింగ్ వద్ద గ్రూడ్స్ రైలు పట్టాలు తప్పింది.  31823 నెంబర్ గల గూడ్స్ రైలు బన్సీ పహార్ పూర్- రుబ్బాస్ రైలు ట్రాక్ లోని లెవల్ క్రాసింగ్ నుంచి వెళ్తుండగా ఓ ట్రాక్టర్ రైల్వే క్రాసింగ్ గేట్ అతివేగంగా దాటేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో గూడ్స్ రైలు ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో నాలుగు కోచ్ లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయని ...వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.  గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ ట్రాక్ పై రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.