ఎదురెదురుగా ఢీకొన్న రెండు రైళ్లు

ఎదురెదురుగా ఢీకొన్న రెండు రైళ్లు

పశ్చిమబెంగాల్ లో జూన్ 25వ తేదీ ఆదివారం తెల్లవారుజామున మరో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బంకురా సమీపంలో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొట్టుకున్నాయి. దీంతో 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఒండా రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

గూడ్స్ రైళ్లలో ఒకటి మరో రైలును వెనుక నుంచి ఢీకొట్టడంతో 12 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. గూడ్స్ రైలు డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. 

ఈ ప్రమాదంతో ఆద్రా డివిజన్ లోని రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫురూలియా ఎక్స్ ప్రెస్ వంటి రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.