
వేములవాడరూరల్, వెలుగు : విద్యార్థులు సామర్థ్యం పెంచుకుంటే ఎన్నో అవకాశాలు వస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలని గౌడ్ అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్(గోపా) రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్ అన్నారు. వేములవాడ పట్టణంలోని గౌడ భవన్లో గోపా ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్లో అత్యంత ప్రతిభ కనబర్చిన గౌడ విద్యార్థులకు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఇది కర్తవ్యాన్ని బోధించే కార్యక్రమం అన్నారు. రానున్న రోజుల్లో మరింత ప్రతిభ కనబరచాలన్నారు.
1600లో సర్వాయి పాపన్నగౌడ్ అనే వేగుచుక్క పుట్టిందని ఆయన ఆశయ సాధనలో ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బత్తిని సత్యనారాయణ, లీడర్లు కల్యాణ్ చక్రవర్తి, ఎల్లమ్మల లక్ష్మణ్, గోపా జిల్లా అధ్యక్షుడు అమరేందర్, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, జిల్లా లైబ్రరీ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సభ్యులు రిటైర్డ్ జడ్జి ఎన్.శంకర్, కోరుట్ల ఎస్ఐ రామచంద్రం, గౌడకులస్తులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.