
సికింద్రాబాద్, వెలుగు: అర్ధరాత్రి డాగర్లు (ఒక రకమైన కత్తులు) చూపి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు కరడుగట్టిన ముఠాను గోపాలపురం పోలీసులతో కలిసి టాస్క్ఫోర్స్ అరెస్టు చేసింది. నిందితుల వద్ద నుంచి రెండు డాగర్లు, మూడు సెల్ఫోన్లు, హోండా యాక్టివాను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫలక్నుమా, ముస్తాఫానగర్కు చెందిన మసూద్ఉర్ రహ్మన్(31) చిన్నతనం నుంచి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. చదువు మానేసి కొంతకాలం వెల్డర్గా , తర్వాత క్యాబ్ డ్రైవర్గా పనిచేశాడు.
డ్రైవర్గా వచ్చే జీతం వ్యసనాలకు సరిపోకపోవడంతో ఈజీ మనీకి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. గతంలో నాచారం, మైలార్ దేవపల్లి పోలీసుస్టేషన్పరిధిలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లాడు. ఈ నెల 19న ముషీరాబాద్లోని తన బంధువుల ఇంటికి వచ్చిన మసూద్.. స్క్రాప్ బిజినెస్ చేస్తున్న ఫజల్ఉర్రహ్మన్ను కలిశాడు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనాలు చేద్దామని, అతడికి ప్లాన్ వివరించాడు. అందులో భాగంగా డాగర్లను తీసుకుని రాత్రి 12.30 గంటల సమయంలో చాదర్ఘట్ వైపు వెళ్లారు. మలక్పేట్స్వాగత్ బార్ ఎదురుగా పార్క్ చేసి ఉన్న హోండా యాక్టీవాను దొంగిలించారు.
ఈ నెల 20 తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో సికింద్రాబాద్ వైపు వెళ్లి, రైల్వేస్టేషన్కు నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి సెల్ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించారు. అతడు ప్రతిఘటించడంతో డాగర్లతో చంపేస్తామంటూ బెదిరించి సెల్ఫోన్ లాక్కొని పారిపోయారు. ఈ క్రమంలో తమకు అడ్డుగా వచ్చిన వారిని డాగర్లు చూపిస్తూ భయబ్రాంతులకు గురిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకునే క్రమంలో.. బైక్ టైరుపై కాల్పులు జరపగా, ఫజల్ కుడి కాలికి తగిలింది. మరో రౌండ్ కాల్పులు జరిపినా నిందితులు పారిపోయారు. దీంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 24 గంటల్లో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.