ఇంజినీరింగ్ చేసినోళ్లకు గుడ్ న్యూస్! NTPCలో 515 ఇంజినీరింగ్ పోస్టులు..

 ఇంజినీరింగ్ చేసినోళ్లకు గుడ్ న్యూస్! NTPCలో  515 ఇంజినీరింగ్ పోస్టులు..

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్  చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25.

ఖాళీలు: 515 (ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ).

విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్ 165, మెకానికల్ 210, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్ 125. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 15.

ఎలిజిబిలిటీ:  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. గేట్ -2025 పూర్తిచేసి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 27 ఏండ్లు, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 11.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులకు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 25.

సెలెక్షన్ ప్రాసెస్: గేట్ - 2025 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు..

పూర్తి వివరాలకు ntpc.co.in వెబ్ సైట్ సందర్శించండి.