గోపీచంద్ కొత్త మూవీ..షెడ్యూల్ షురూ

 గోపీచంద్ కొత్త మూవీ..షెడ్యూల్ షురూ

ఇటీవల ‘భీమా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన గోపీచంద్.. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న తొలిచిత్రమిది. తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా చేరింది. ఈ సందర్భంగా నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద బ్యానర్‌‌‌‌‌‌‌‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది.  

విశ్వప్రసాద్ గారికి థ్యాంక్స్. సినిమా చాలా అద్భుతంగా వస్తోంది. బుధవారం నుంచి కొత్త షెడ్యూల్ మొదలైంది. లీడ్ యాక్టర్స్‌‌‌‌‌‌‌‌పై కీలక సన్నివేశాలు తీస్తున్నాం. ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌తో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. శ్రీను వైట్ల మార్క్ వినోదంతో పాటు ఇందులో ఓ యూనిక్ పాయింట్ ఉంది’ అని చెప్పారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.