కేటీఆర్ చదువుకున్న మూర్ఖుడు: ఎమ్మెల్యే రాజాసింగ్

కేటీఆర్ చదువుకున్న మూర్ఖుడు: ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ పై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే మండిపడ్డారు. కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన ట్వీట్ లో తప్పేముందన్నారు రాజాసింగ్. ఎమ్మెల్సీ కవిత బెయిల్ ఇవ్వాలని వాదించిన వ్యక్తికి కాంగ్రెస్ రాజ్యసభ టిక్కెట్ ఇచ్చింది నిజం కాదా? అని అన్నారు. 38 మంది ఎమ్మెల్యేలున్నా రాజ్యసభకు బీఆర్ ఎస్ పార్టీ తరపున ఎందుకు నామినేషన్ వేయలదని ప్రశ్నించారు. 

కేకే ఎంపీ పదవికి రాజీనామా చేస్తే ఆ సీటును కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యక్తికి ఎందుకు ఇవ్వలేదని అన్నారు.  కాంగ్రెస్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నిక జరిగేలా చేసేందుకు బీఆర్ ఎస్ తరపున అభ్యర్థిని నిలబెట్టలేదన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్ ఒక్కటేనని ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అన్నారు. కాంగ్రెస్ లో బీఆర్ ఎస్ విలీనం కావడం ఖాయమన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.