‘బీఆర్ఎస్’ విజయం కోరుతూ అమ్మవారి సేవలో ప్రభుత్వ చీఫ్ విప్ 

‘బీఆర్ఎస్’ విజయం కోరుతూ అమ్మవారి సేవలో ప్రభుత్వ చీఫ్ విప్ 

వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీ విజయవంతంగా కొనసాగాలని వరంగల్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ చెప్పారు. BRS పార్టీ విజయం కోసం కేసీఆర్ కు మరిన్ని శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను దేశం అనుసరిస్తోందన్నారు. వరంగల్ భద్రకాళీ అమ్మవారి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర  ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసిందని, మాడ వీధుల నిర్మాణం కోసం ఆ నిధులను ఉపయోగిస్తామని చెప్పారు.