డిసెంబర్ 22న ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం క్రిస్మస్​ వేడుకలు

డిసెంబర్ 22న ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం క్రిస్మస్​ వేడుకలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకలలో  సీఎం ఎ.రేవంత్ రెడ్డి పాల్గొననున్నారని రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్  ఎ.కాంతి వెస్లీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ప్రభుత్వం తరపున కార్పొరేషన్ ఈ వేడుకలను నిర్వహిస్తుంది. ఈ వేడుకలలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.