కార్పొరేట్ విద్యాసంస్థల నియంత్రణలో ప్రభుత్వం విఫలం

కార్పొరేట్ విద్యాసంస్థల నియంత్రణలో ప్రభుత్వం విఫలం

ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు ఇంటర్ విద్యాసంస్థల బంద్ కు పిలుపునిస్తున్నామని  ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. నారాయణగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ముందు ధర్నా చేపట్టిన ఏబీవీపీ నాయకులు... కార్పొరేట్ విద్యాసంస్థలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ మేరకు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి ఇంటర్ విద్యలో కార్పొరేట్ కళాశాలలను  ప్రభుత్వ నియంత్రించడం లేదని ఆరోపించారు. కార్పొరేట్ విద్యాసంస్థలపై ఇంటర్ బోర్డ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. ఒకే పేరుతో వందల బ్రాంచ్ లు నిర్వహిస్తున్న నారాయణ శ్రీ చైతన్య సహా ఇతర కార్పొరేట్ కళాశాలలను నియంత్రించాలని ప్రవీణ్ రెడ్డి డిమాండ్ చేశారు.

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తోన్న, అనుమతి లేని కళాశాలపై చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ర్యాంక్ లను ప్రచారం చేస్తున్న కళాశాలల గుర్తింపు రద్దు చేయాలన్న ఆయన.. అధిక ఫీజులను నియంత్రించి, ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని కోరారు. ఇంటర్ విద్యలో కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలు, ఆత్మహత్య లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. కార్పొరేట్  విద్యాసంస్థలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని.. అందుకు నిరసనగా రేపు ఇంటర్ విద్యాసంస్థల బంద్ కు పిలుపునిస్తున్నామని ప్రవీణ్ రెడ్డి స్పష్టం చేశారు.