ఆగ్రోస్​ రైతు సేవా సెంటర్లపై గవర్నమెంట్​ ఫోకస్

ఆగ్రోస్​ రైతు సేవా సెంటర్లపై గవర్నమెంట్​ ఫోకస్
  • పాతవాటిని బలోపేతం చేస్తూ ​ కొత్త సెంటర్ల ఏర్పాటు
  • అగ్రికల్చర్​ డిగ్రీ ఉన్న యువతకు ​ ఉపాధి
  • చిన్న, సన్నకారు రైతులకు అందుబాటులోకి  సేవలు
  • బీఆర్​ఎస్​ పాలనలో నిస్తేజం
  • కాంగ్రెస్​ సర్కారు చెంతకు సేవా సెంటర్ల వివరాలు

నిజామాబాద్​, వెలుగు : ఉమ్మడి జిల్లాలో ఆగ్రోస్​ రైతు సేవా సెంటర్లు యాక్టివ్​ కానున్నాయి. గ్రామీణ నేపథ్యం గల వ్యవసాయ డిగ్రీ హోల్డర్లకు ఉపాధి చూపడంతో పాటు చిన్న సన్న కారు రైతులకు సేవలు అందించడంపై గవర్నమెంట్​ ఫోకస్​ పెట్టింది. బీఆర్​ఎస్​ సర్కారు హయాంలో పదేండ్ల పాటు చతికిల పడిన సెంటర్లకు మళ్లీ ప్రాణం పోయాలని కాంగ్రెస్​ ప్రభుత్వం ​నిర్ణయించింది. నిజామాబాద్​, కామారెడ్డి  జిల్లాల్లో  అఫీషియల్​గా 48 ఆగ్రోస్​ కేంద్రాలు ఉండగా వాటి వివరాలను సర్కారు తెప్పించుకుంది.  

ఇప్పుడున్న వాటికి అదనంగా కొత్తవి మరిన్ని ఏర్పాటు కాబోతున్నాయి.  మాజీ  సీఎం వైఎస్​ హయాంలో అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​ఆధ్వర్యంలో గవర్నమెంట్​ 2007లో ఆగ్రోస్​ రైతు సేవా సెంటర్లు ఏర్పాటు చేసింది.  విలేజ్​ల్లోని వ్యవసాయ డిగ్రీ లేక అనుబంధ డిగ్రీ చేసిన వారికి లైసెన్స్​లు ఇచ్చి వీటిని అప్పగించింది.  ఖరీఫ్​, వానాకాలం పంటలకు కావాల్సిన మొత్తం యూరియాలో 60 శాతం మార్క్​ఫెడ్  సంస్థ ద్వారా సింగిల్ ​విండోలకు చేరతాయి.  20 శాతం ప్రైవేట్​ డీలర్లకు మిగితా 20  శాతం ఆగ్రోస్​ రైతు సేవా సెంటర్ల ద్వారా రైతులకు విక్రయించేవారు. 

యూరియా, పంట విత్తనాలు, క్రిమిసంహార మందులు ఈ సెంటర్ల ద్వారా అమ్మేవారు.  రూ.3 లక్షల డబ్బు డిపాజిట్​ చేయించుకొని ఆ మేరకు స్టాకు ఇచ్చేవారు అమ్మిన డబ్బులు కడితే మళ్లీ సరకు ఇచ్చేవారు.   సింగిల్​ విండోల అవినీతికి బ్రేక్​ వేయడంతో పాటు రైతులకు మెరుగైన సేవలు అందించడం ఈ సెంటర్ల ఉద్దేశం.  మార్క్​ఫెడ్​ సంస్థ  సింగిల్​ విండోలకు అందించే యూరియాను అధిక శాతం  క్రెడిట్ పై ​అమ్మడం వల్ల అవినీతి జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని ఆపడానికి రైతు సేవా సెంటర్లను ఎక్కువ ప్రోత్సహించేవారు. 

గవర్నమెంట్ తరహాలో ఆగ్రోస్​ రైతు సేవా సెంటర్లు వడ్ల కొనుగోలు చేసి కమీషన్​ రూపేణా ఆదాయం పొందుతాయి. ప్రతి సీజన్ లో  రూ.8 లక్షలు కమీషన్​ ఇన్​కమ్​ పొందే ఆగ్రోస్​ సెంటర్లు ఉన్నాయి. బీఆర్​ఎస్​ గవర్నమెంట్​ కేవలం వడ్ల కొనుగోలు వరకే వీటిని పరిమితం చేసి యూరియా, సీడ్​, ఫెస్టిసైడ్​ మందుల సప్లై  బంద్​ చేసింది.  దీంతో ఆగ్రోస్​కు రెగ్యూలర్​ యాక్టివిటీస్​ లేకుండా పోయింది.

డిగ్రీ హోల్డర్ల వివరాల సేకరణ ఆగ్రోస్​ రైతు సేవా సెంటర్లను బలోపేతం చేయాలని నిర్ణయించిన  స్టేట్​ గవర్నమెంట్​ ఉమ్మడి జిల్లాలోని 48  కేంద్రాల వివరాలు రెవెన్యూ, అగ్రికల్చర్ శాఖలతో తెప్పించుకుంది.  విలేజ్​ల వారీగా అగ్రికల్చర్​ లేక అనుబంధ డిగ్రీ హోల్డర్ల సమాచారం సేకరించింది. ఇప్పుడున్న వాటికి రెండు, మూడు రెట్ల​ స్థాయిలో కొత్త సెంటర్లకు లైసెన్స్​ ఇవ్వాలని నిర్ణయించింది. మాజీ సీఎం వైఎస్​ఆర్​ హయాంలో మాదిరి 20 శాతం యూరియా అమ్మకాలతో పాటు పంట విత్తనాలు​, క్రిమికీటకాల పిచికారీ మందులు వీటితోనే  సేల్​ చేయించాలని డిసైడ్​ అయింది. 

అవును నిజమే 

ఆగ్రోస్​ రైతు సేవా సెంటర్లు బలోపేతం చేయాలని  గవర్నమెంట్​ నిర్ణయించిన మాట నిజమే. తమ నుంచి సర్కారు అడిగిన వివరాలు పంపినం. ఇప్పుడున్న సెంటర్లు యాక్టివిటీస్​లేక చాలా వరకు సైలైంట్​ అయ్యాయి. కొత్త మార్గదర్శకాలు వచ్చాక జోష్​తో పనిచేసే వీలుంది.  .

వాజీవ్​హుస్సేన్​, జిల్లా అగ్చికల్చర్​ ఆఫీసర్​