సర్కార్‌పై కామెంట్.. సూర్యాపేట ZP CEO పై వేటు

సర్కార్‌పై కామెంట్.. సూర్యాపేట  ZP CEO పై  వేటు

సూర్యాపేట జిల్లా ZP CEO ప్రేమ్ కరణ్ రెడ్డిని కమిషనరేట్ కు అటాచ్ చేశారు. కమిషనర్ ఆఫీసులో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ప్రేమ్ కరణ్ రెడ్డి చేసిన కామెంట్స్ తోనే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన సమావేశంలో మాట్లాడిన ప్రేమ్ కరణ్ రెడ్డి...రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్కూల్స్ చెప్పినట్లు వింటుందన్నారు. కార్పొరేట్ స్కూల్స్ కు ఉన్న ప్రాధాన్యత ప్రభుత్వ పాఠశాలలకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్స్ తెరిస్తే డబ్బులు ఖర్చవుతాయన్న ఆలోచనలో ప్రభుత్వ ఉండడం దారుణమన్నారు. ప్రస్తుతం సూర్యాపేట ఇంఛార్జ్ ZP CEOగా సూర్యాపేట RDOకి బాధ్యతలు అప్పగించారు.