
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: వైద్య సేవలను నిర్లక్ష్యం చేయవద్దని ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం నాగర్ కర్నూల్ జనరల్ హాస్పిటల్, మెడికల్ కాలేజీని కలెక్టర్ బాధావత్ సంతోష్ తో కలిసి విజిట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాతీయ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాలను అనుగుణంగా సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు.
వైద్య పరికరాలు, యంత్రాల అవసరంపై రిపోర్టు ఇవ్వాలన్నారు. అందరూ బాధ్యతాయుతంగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మి, కాలేజీ ప్రిన్సిపాల్ రమాదేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘు పాల్గొన్నారు.