గుజరాత్​ ప్రాజెక్టు కోసం ఇన్ స్టాషీల్డ్ పెట్టుబడి రూ.45 కోట్లు

గుజరాత్​ ప్రాజెక్టు కోసం ఇన్ స్టాషీల్డ్ పెట్టుబడి  రూ.45 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: ఇటీవలి వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024లో మెడ్‌‌టెక్ వెల్‌‌నెస్ కంపెనీ ఇన్‌‌స్టాషీల్డ్ కొత్త ప్రాజెక్టు కోసం అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ‘రివల్యూషనైజింగ్ వైరస్ డిస్ట్రప్షన్’ అనే ప్రాజెక్ట్ అమలు కోసం ఇద్దరి మధ్య ఎంఓయూ కుదిరింది.

ప్రాజెక్టు అమలుకు ఇన్‌‌స్టాషీల్డ్  రూ.45 కోట్లు ఇన్వెస్ట్​ చేస్తుంది. రాష్ట్ర ప్రజలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి కరోనా సహా రకరకాల వైరస్​లను నిర్మూలనకు కార్యక్రమాలు చేపడుతామని ఇన్​స్టా షీల్డ్ ప్రకటించింది.