ముడి పెట్రోలియంపై విండ్‌‌‌‌ఫాల్ పన్నుపెంపు

ముడి పెట్రోలియంపై విండ్‌‌‌‌ఫాల్ పన్నుపెంపు
  • డీజిల్‌‌‌‌పై పన్ను తొలగింపు 

న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై పన్నును ప్రభుత్వం శుక్రవారం నుంచి టన్నుకు రూ.3,300 నుంచి రూ.4,600కు పెంచింది. పన్ను ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ (ఎస్​ఏఈడీ) రూపంలో దీనిని విధిస్తారు. డీజిల్ ఎగుమతిపై ఎస్​ఏఈడీ లీటరు రూ. 1.50 నుంచి పూర్తిగా రద్దు చేశారు. 

పెట్రోలు  జెట్ ఇంధనం లేదా ఏటీఎఫ్​పైనా లెవీ ఏమీ ఉండదు. కొత్త రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయి. భారతదేశం మొదటిసారిగా జూలై 1, 2022న విండ్‌‌‌‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌‌‌‌లను విధించింది. గత రెండు వారాల సగటు చమురు ధరల ఆధారంగా ప్రతి పక్షం రోజులకు ఒకసారి పన్ను రేట్లను సమీక్షిస్తారు. ఇంధన కంపెనీల సూపర్‌‌‌‌నార్మల్ లాభాలపై విధించే పన్ను ఇది.