మైనింగ్‌‌‌‌తో సర్కార్ ఆదాయం పెర‌‌‌‌గాలి.. గ‌‌‌‌నుల శాఖపై స‌‌‌‌మీక్షలో మంత్రి వివేక్ వెంకటస్వామి

మైనింగ్‌‌‌‌తో సర్కార్ ఆదాయం పెర‌‌‌‌గాలి.. గ‌‌‌‌నుల శాఖపై స‌‌‌‌మీక్షలో మంత్రి వివేక్ వెంకటస్వామి
  • గనుల నిర్వహ‌‌‌‌ణ‌‌‌‌లో పార‌‌‌‌ద‌‌‌‌ర్శక‌‌‌‌త పాటించాలి
  • ప్రజ‌‌‌‌లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి

హైద‌‌‌‌‌‌‌‌రాబాద్, వెలుగు: మైనింగ్​తో ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి అధికా రులను ఆదేశించారు. అదే సమయంలో మైనింగ్​తో ప్రజలకు నష్టం కలగకుండా వ్యవ హరించాలని స్పష్టం చేశారు. శనివారం (జూన్ 21) సెక్రటేరియెట్​లో మైనింగ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. 

ఈ సంద‌‌‌‌‌‌‌‌ర్భంగా శాఖలో ప్రస్తుత పరిస్థితులు, మైనింగ్ అనుమతులు, కార్మికుల సంక్షేమం, రెవెన్యూ పెంపు, భద్రతా చర్యలు వంటి కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ మైనింగ్ జ‌‌‌‌‌‌‌‌రుగుతోంది? ఆదాయం పెంచేందుకు ఎక్కడ అవ‌‌‌‌‌‌‌‌కాశాలు ఉన్నాయి? లాంటి వివ‌‌‌‌‌‌‌‌రాలు అధికా రుల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మైన్ల నిర్వహణలో పారదర్శకత, కార్మికుల హక్కులు, పర్యావరణ పరిరక్షణకు ప్రభు త్వం కట్టుబడి ఉంద‌‌‌‌‌‌‌‌న్నారు. 

సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తగిన సూచనలు చేశారు. స‌‌‌‌‌‌‌‌మావేశంలో టీజీఎండీసీ చైర్మన్ ఈర‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ర్తి అనీల్‌‌‌‌‌‌‌‌, మైనింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్ శ్రీ‌‌‌‌‌‌‌‌ధ‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌, మైనింగ్ శాఖ డైరెక్టర్​శ‌‌‌‌‌‌‌‌శాంక, టీజీఎండీసీ ఎండీ భ‌‌‌‌‌‌‌‌వేష్ మిశ్రా, ఇత‌‌‌‌‌‌‌‌ర అధికారులు పాల్గొన్నారు.