ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 6 యంగ్​ ఇండియా స్కూల్స్​ 

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 6 యంగ్​ ఇండియా స్కూల్స్​ 

కామారెడ్డి, వెలుగు : ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాకు 6 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరయ్యారు. ఇది వరకు 4 స్కూల్స్​ మంజూరు కాగా, తాజాగా  మరో 2 స్కూల్స్​ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  నిజామాబాద్​ జిల్లా పరిధిలో 4,   కామారెడ్డి జిల్లాలో 2  స్కూళ్లను అత్యాధునిక ప్రమాణాలతో కూడిన సౌకర్యాలతో నిర్మించనున్నారు.  ప్రభుత్వం ఒక్కో స్కూల్​కు రూ. 200 కోట్లు కేటాయించింది.  ఒక్కో స్కూల్ 20 నుంచి 25 ఎకరాల సముదాయంలో ఉంటుంది.  డిజిటల్ క్లాస్​ రూమ్స్, అకాడమిక్​ బిల్డింగ్స్​, అడ్మినిస్ర్టేటీవ్ బిల్డింగ్స్, బాయిస్​, గర్ల్స్​కు వేర్వేరుగా గా హాస్టల్స్,  డార్మెటరీ రూమ్స్, లైబ్రరీ, స్టాప్​ క్వార్టర్ట్స్ ఉంటాయి.   సోలార్ పవర్ సిస్టమ్​ను కూడా  ఏర్పాటు చేస్తారు. 

 ఒక్కో స్కూల్​లో  2,500 మంది వరకు విద్యార్థులు 6 నుంచి ఇంటర్​ వరకు చదువుకొవటానికి వీలుంటుంది.   ఫస్ట్ విడతలో నిజామాబాద్ జిల్లా బోధన్,  నిజామాబాద్ రూరల్ నియోజక వర్గాలకు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గానికి వచ్చాయి. ఆ తర్వాత  నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ నియోజక వర్గానికి ఇచ్చారు.  తాజాగా ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజక వర్గాలకు స్కూళ్లు మంజూరయ్యాయి. ఇంకా కామారెడ్డి,  నిజామాబాద్​ ఆర్బన్​,  బాల్కొండ నియోజకవర్గాలకు  యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​  రెసిడెన్షియల్ స్కూల్ప్​ రావాల్సి ఉంది.