గవర్నమెంట్ టీచర్ పై పోక్సో కేసు

గవర్నమెంట్ టీచర్ పై పోక్సో కేసు

హుస్నాబాద్, వెలుగు: విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించిన గవర్నమెంట్​ టీచర్​పై పోక్సో కేసు నమోదైంది. ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్  మండలం మహమ్మదాపూర్  గవర్నమెంట్​ స్కూల్​లో పని చేస్తున్న ఉప్పుల వేణుగోపాల్  అదే స్కూల్​లో చదువుకుంటున్న ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేశారు.

విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం సాయంత్రం స్కూల్​కు వెళ్లి సదరు టీచర్​పై దాడి చేశారు. టీచర్​పై పోక్సో కేసు నమోదవగా, హెచ్ఎం మహేందర్​రెడ్డి ఫిర్యాదు మేరకు ఏబీవీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు