చెక్కు బౌన్స్​కేసులో గవర్నమెంట్ టీచర్​కు మూడు నెలల జైలు

చెక్కు బౌన్స్​కేసులో గవర్నమెంట్ టీచర్​కు మూడు నెలల జైలు
  •     గవర్నమెంట్ టీచర్​కు మూడు నెలల జైలు

గజ్వేల్​, వెలుగు : అప్పు తీసుకుని తిరిగి చెల్లించడానికి ఇచ్చిన చెక్కు బౌన్స్​ అవ్వడంతో ఓ గవర్నమెంట్​టీచర్​కు గజ్వేల్​ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. అడ్వకేట్ పార్థసారధిరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్​ పట్టణానికి చెందిన రామయ్య వద్ద మజీద్​పల్లి ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్​గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు రూ.2.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.

అనంతరం చెక్కు ద్వారా చెల్లింపులు జరిపాడు. రామయ్య చెక్కును బ్యాంకులో వేయగా అది బౌన్స్​ అయింది. పదే పదే చెక్​ బౌన్స్ కావడంతో​2018లో రామయ్య గజ్వేల్ ప్రిన్సిపల్​ సివిల్​జడ్జి కోర్టులో కేసు వేశాడు. దీనిపై బాధితుడి తరపున వాదనలు వినిపించగా బుధవారం జడ్జి  సౌమ్య మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిందని తెలిపాడు.