రోళ్లవాగు పనులు పూర్తి చేస్తాం

రోళ్లవాగు పనులు పూర్తి చేస్తాం

జగిత్యాల టౌన్/ రాయికల్‌‌‌‌‌‌‌‌, వెలుగు :  రోళ్లవాగు ప్రాజెక్టు పెండింగ్​పనులను పూర్తిచేస్తామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. శనివారం సారంగాపూర్, రాయికల్‌‌‌‌‌‌‌‌ మండలాల్లోని పలు గ్రామాల్లో కొత్త జీపీ భవనాలకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ వసంతతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా

వారు మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే ఏ విషయంలో పార్టీలకతీతంగా పనిచేస్తామన్నారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సంధ్యారాణి, జడ్పీటీసీ జాదవ్​ ఆశ్విని, సర్పంచులు సుమలత, రవి, ఎంపీటీసీలు విజయలక్ష్మి, స్వప్న, అధికారులు పాల్గొన్నారు.