అక్టోబర్ 05న కాకా జయంతి .. ట్యాంక్​బండ్ దగ్గర అధికారికంగా జరపనున్న సర్కార్

అక్టోబర్ 05న కాకా జయంతి .. ట్యాంక్​బండ్ దగ్గర  అధికారికంగా జరపనున్న సర్కార్

హైదరాబాద్, వెలుగు: మాజీ కేంద్ర మంత్రి, తెలంగాణ ఉద్యమ నేత గడ్డం వెంకటస్వామి(కాకా) 95వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ నెల 5వ తేదీన ట్యాంక్​ బండ్​ దగ్గర సాగర్​పార్క్​లో జయంతి కార్యక్రమాన్ని జరపనున్నారు. ఈ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్​ రెడ్డితో పాటు కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి హాజరుకానున్నారు. 

ఉదయం 10 గంటల నుంచి ప్రోగ్రామ్ మొదలు కానుంది. కాకా జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇటీవలె ఉత్తర్వులు ఇచ్చింది. దానికి అనుగుణంగా జయంతి కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.