హైదరాబాద్, వెలుగు: టిక్టాక్ను ప్రభుత్వ పథకాల ప్రచారానికి ఉపయోగించుకోనున్నారు. టిక్టాక్ను ఎలా వాడాలనే దానిపై సోమవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో ప్రభుత్వ పీఆర్వోలకు శిక్షణ ఇచ్చారు. టిక్టాక్ ఇండియా, ఐటీ శాఖ, డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణలో అన్ని శాఖల పీఆర్వోలు పాల్గొన్నారు.
ప్రభుత్వం ట్విట్టర్, ఫేస్బుక్, షేర్చాట్ లాంటి వాటిని వాడుకుని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేస్తోంది. ఇటీవల టిక్టాక్ వినియోగదారులు భారీగా పెరగడంతో ఇందులోనూ ప్రచారం చేయాలని నిర్ణయించింది. టిక్టాక్ను వాడటానికి సెక్యూర్డ్ పద్ధతులను టిక్టాక్ ఇండియా అధికారులు వివరించారు.