
హైదరాబాద్, వెలుగు: గవర్నర్జిష్టుదేవ్వర్మతో అడ్వకేట్జనరల్ సుదర్శన్రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. పంచాయతీరాజ్చట్టం–2018 సవరణ ఆర్డినెన్స్ముసాయిదాపై గవర్నర్ లీగల్ఒపీనియన్ కోరగా.. దానిపై ఆయనకుఏజీ వివరించినట్లు తెలిసింది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285(ఏ)లో రిజర్వేషన్ల సంఖ్యను ప్రస్తావించకుండా మార్పు చేయడంపై గవర్నర్ ప్రత్యేకంగా అడిగినట్లు సమాచారం.
ప్రస్తుతం ఉన్న చట్టంలో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే నిబంధన ఉన్నదని, రిజర్వేషన్లు ఎంత శాతం అమలు చేస్తారని, ఇది లీగల్గా ఇబ్బందులు తీసుకురాదు కదా? అని గవర్నర్ వివరణ కోరగా.. అలాంటిదేమీ లేదనిఏజీ చెప్పినట్టు తెలిసింది. దీంతో ఒకటి, రెండు రోజుల్లో పంచాయతీరాజ్చట్ట సవరణ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదముద్ర వేస్తారని ప్రభుత్వం భావిస్తున్నది.