గవర్నర్​ రాజకీయాలు చేస్తున్నారు.. మంత్రి గంగుల కమలాకర్​

గవర్నర్​ రాజకీయాలు చేస్తున్నారు.. మంత్రి గంగుల కమలాకర్​

గవర్నర్​ తమిళి సై రాజకీయాలు చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్​ ఆరోపించారు. కరీంనగర్​ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్​పూర్​ గ్రామంలో మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.  అనంతరం మీడియాతో మాట్లాడారు...

ప్రతి గింజా కొంటాం...

గవర్నర్​ రాజకీయాలు చేయకపోతే ఆమెను గౌరవించేవారిమని గంగుల అన్నారు. సీఎం కేసీఆర్​ రాజ్యాంగ బద్ధ పదవిలో ఉండి రాజకీయం చేసేవారిని కలవరని చెప్పారు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కర్షకులెవరూ అధైర్యపడొద్దని, తడిసిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.