25 ఏండ్లుగా పేదలకు క్యాన్సర్‌‌ ట్రీట్‌మెంట్‌..బసవతారకం హాస్పిటల్ సేవలు భేష్‌‌‌‌‌‌‌‌: గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిష్ణుదేవ్‌‌‌‌‌‌‌‌ వర్మ

25 ఏండ్లుగా పేదలకు క్యాన్సర్‌‌ ట్రీట్‌మెంట్‌..బసవతారకం హాస్పిటల్ సేవలు భేష్‌‌‌‌‌‌‌‌: గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిష్ణుదేవ్‌‌‌‌‌‌‌‌ వర్మ
  • ఈ ఆస్పత్రికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తాం: మంత్రి దామోదర
  • వ్యక్తిగత నష్టం వల్ల పుట్టిందే ఈ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌: బాలకృష్ణ
  • హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో బసవతారకం క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆస్పత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు

హైదరాబాద్, వెలుగు: దాతృత్వం కలిగిన నటుడు, నాయకుడు ఎమ్మెల్యే బాలకృష్ణ అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. అందరికీ తక్కువ ఖర్చుతో ఉన్నతమైన వైద్య సేవలు అందించాలనే ఆయన లక్ష్యం చాలా గొప్పదని కొనియాడారు. ఆదివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో నూతనంగా ఏర్పాటు చేసిన లీనియర్ యాక్సిలరేటర్ (రేడియోథెరపీ యంత్రం)ను ఆవిష్కరించారు. బసవతారకం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను నందమూరి తారక రామారావు స్థాపించిన సంస్థగా, పేదలకు సైతం అధునాతన వైద్య సేవలు అందిస్తూ, గత 25 ఏండ్లుగా క్యాన్సర్ చికిత్సలో అగ్రగామిగా నిలిచినందుకు గవర్నర్ ప్రశంసించారు. 

జిల్లాల్లో మొబైల్‌‌‌‌‌‌‌‌ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్క్రీనింగ్‌‌‌‌‌‌‌‌ యూనిట్లు: దామోదర 

క్యాన్సర్‌‌‌‌‌‌‌‌తో మరణించిన తన భార్య బసవతారకం పేరిట ఆమె భర్త ఎన్టీఆర్ 25 ఏండ్ల కిందట ఈ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారని హెల్త్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దామోదర రాజనర్సింహ అన్నారు. నాటి నుంచి నేటి వరకు లక్షలాది మంది పేషెంట్లకు ఈ హాస్పిటల్ వైద్య సేవలు‌‌‌‌‌‌‌‌ అందిస్తోందని గుర్తుచేశారు. నాటి ఆయన విజనే నేటి ఈ హాస్పిటల్ అని పేర్కొన్నారు. లక్షలాది మంది పేద రోగులకు వారి జీవితంపై ఆశ, నమ్మకాన్ని ఈ ఆసుపత్రి కలిగిస్తుందని చెప్పారు.

దేశవ్యాప్తంగా క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ సమస్య పెరుగుతోందని, తెలంగాణలో ఏటా 50 వేల నుంచి 55 వేల మంది క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ బారిన పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్లీ స్టేజ్‌‌‌‌‌‌‌‌లో గుర్తిస్తేనే ఈ వ్యాధిని నయం చేయగలమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొబైల్ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ స్క్రీనింగ్ యూనిట్లను ప్రారంభించబోతున్నామని తెలిపారు. క్యాన్సర్ స్క్రీనింగ్, డయాగ్నొసిస్, డే కేర్ కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ వంటి సేవలన్నీ ఈ సెంటర్లలో‌‌‌‌‌‌‌‌ అందిస్తామని వెల్లడించారు. . పేదలకు సేవలు అందిస్తున్న బసవతారకం వంటి హాస్పిటళ్లకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

రాజనర్సింహ పేరుతో సినిమా తీస్త: బాలకృష్ణ

డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పేరుతో సినిమా తీయాలనుకుంటున్నట్లు బసవతారకం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్ బాలకృష్ణ వెల్లడించారు. అయితే, ఆ చిత్రానికి దామోదర రాజనర్సింహ టైటిల్ కాకుండా.. దబిడి దిబిడి రాజనర్సింహ అని టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. బసవతారకం క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను డబ్బుల కోసమో, లాభాల కోసమో ఏర్పాటు చేయలేదని, వ్యక్తిగత నష్టం వల్ల కలిగిన ఆలోచన నుంచి పుట్టిందని తెలిపారు. తన తల్లి క్యాన్సర్‌‌‌‌‌‌‌‌తో చనిపోయిందని.. దీంతో అందరికి క్యాన్సర్ చికిత్స అందించాలనే లక్ష్యంతో తన తండ్రి ఎన్టీఆర్ ఈ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను స్థాపించారని వివరించారు.

110 బెడ్స్‌‌‌‌‌‌‌‌తో ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ నేడు స్టేట్ ఆఫ్ ఆర్ట్ పరికరాలతో దేశంలోనే అత్యున్నత ఆసుపత్రుల్లో ఒకటిగా నిలిచిందని గుర్తుచేశారు. తమకు పూర్తి సహకారం అందిస్తున్న తెలంగాణ ప్రభూత్వానికి, హెల్త్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దామోదర రాజనర్సింహకు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో కూడా సహకారం అందిస్తున్న ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబుకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. వెయ్యి బెడ్స్‌‌‌‌‌‌‌‌తో అమరావతిలో కూడా ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నామని స్తున్నామని ఆయన వెల్లడించారు.