అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ

అమిత్ షాతో గవర్నర్  తమిళిసై భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ గవర్నర్ తమిళిసై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయన నివాసంలో 20 నిమిషాలకు పైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షాకు కూమార స్వామి ప్రతిమను ఆమె బహుకరించారు. తెలంగాణకు సంబంధించిన రాజకీయ పరిస్థితులను వివరించినట్లు తెలిసింది. అలాగే నూతన ప్రభుత్వ పాలన విధానం, పథకాల అమలు, ప్రజల  స్పందన ఇతర అంశాలపై హోం మంత్రి ఆరా తీసినట్లు సమాచారం.

భేటీకి సంబంధించిన విషయాలను తమిళి సై వివరించారు. కేంద్ర హోంమంత్రితో ఫలప్రదమైన చర్చలు జరిగాయని చెప్పారు. ఈ భేటీలో తెలంగాణ, పుదుచ్చేరికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను మంత్రికి వివరించానని తెలిపారు.