హైదరాబాద్: బంజారాహిల్స్ లోని స్కూల్లో చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటనపై గవర్నర్ తమిళిసై స్పందించారు. లైంగిక వేధింపుల ఘటన తనను తీవ్ర మనోవేదనకు గురి చేసిందన్నారు. దారుణానికి పాల్పడిన నిందితుడిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో ఇప్పటికే స్కూల్ ప్రిన్సిపాల్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
బంజారహిల్స్ లోని ఓ స్కూల్ లో నాలుగేండ్ల చిన్నారిపై అదే స్కూల్ లో ప్రిన్సిపాల్ వాహన డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే కారణంతో ఆమెపై కూడా కేసు నమోదు చేశారు. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు.