శ్రీవారి సేవలో తెలంగాణ గవర్నర్ తమిళిసై..

శ్రీవారి సేవలో తెలంగాణ గవర్నర్ తమిళిసై..

తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై దర్శించుకున్నారు. మే 10వ తేదీ బుధవారం ఉదయం స్వామి వారి వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. 

అనంతరం ఆలయ వెలుపలకు గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా బాగుండాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారామె. బ్రేక్ సమయంలో మార్పు తీసుకురావడం చాలా మంచి నిర్ణయంమన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని ముందు అందరూ సమానమే అంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయం ఆనందదాయకమని కొనియాడారు. రెండు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనక పోవడానికి కారణం ఆహ్వానించకపోవడమేనని గవర్నర్ తెలిపారు.