సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై..

సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై..

ములుగు జిల్లాలో జరుగుతున్న మేడారం మహాజాతరలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవారం మేడార జాతరకు వెళ్ళిన గవర్నర్.. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వనదేవతలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గవర్మర్ తోపాటు కేంద్ర మంత్రి అర్జున్ ముండా కూడా సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. 

మేడారం మహాజాతర అంగరంగా వైభవంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 21వ తేదీ ప్రారంభమైన మేడారం జాతర..ఫిబ్రవరి 24వ తేదీ ముగుస్తుంది. ఈ క్రమంలో వనదేవతలను దర్శించుకునేందుకు తెలంగాణతోపాటు సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్ ఘడ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, మహారాష్ట్రాల నుంచి తండోపతండాలుగా తరలివస్తున్నారు.  వనదేవతలు గద్దెలపై కొలువుదీరడంతో భక్తులు అమ్మవారులను దర్శించుకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈక్రమంలో జంపన్న వాగులో ఎటు చూసినా జన ప్రవాహమే కనిపిస్తోంది. భక్తులు జంపన్నవాగులో స్నానాలు చేసి నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారు.