గవర్నర్​ది​ పక్షపాత వైఖరి..కోదండరామ్​కు ఎమ్మెల్సీ ఎట్లిస్తరు : ​కేటీఆర్

గవర్నర్​ది​ పక్షపాత వైఖరి..కోదండరామ్​కు ఎమ్మెల్సీ ఎట్లిస్తరు : ​కేటీఆర్

 హైదరాబాద్/సిద్దిపేట, వెలుగు : గవర్నర్​ పక్షపాత వైఖరిని అవంలబిస్తున్నారని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ ​వర్కింగ్ ​ప్రెసిడెంట్ ​కేటీఆర్​ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల కులానికి చెందిన సత్యనారాయణను గవర్నర్​ కోటాలో బీఆర్ఎస్​ప్రభుత్వం నామినేట్ ​చేస్తే.. వారికి రాజకీయ సంబంధాలున్నాయని రిజెక్ట్ ​చేసిన గవర్నర్.. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ప్రొఫెసర్ ​కోదండరామ్​పేరును ఎలా ఆమోదించారో సమాధానం చెప్పాలన్నారు. రిపబ్లిక్ ​డే సందర్భంగా తెలంగాణ భవన్​లో కేటీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ​ప్రజలకు బాధ్యులే తప్ప సీఎంకు కాదన్న విషయం గుర్తించాలన్నారు. రేవంత్​ రెడ్డి అహంకారం, వెకిలి వ్యవహారం చూస్తుంటే వాళ్లు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండ బెట్టినా.. నీచ మానవులు బుద్ధి మారరని పెద్దలు ఎప్పుడో చెప్పారన్నారు.

కాగా, తెలంగాణ భవన్​లో రిపబ్లిక్​ డే వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి మహమూద్​అలీ.. జెండా ఆవిష్కరణ అనంతరం కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే బీఆర్ఎస్​ నాయకులు అతన్ని అపోలో హాస్పిటల్​కు తరలించారు. అయితే, తాను బాగానే ఉన్నానని సాయంత్రం మహమూద్​ అలీ వీడియో సందేశం రిలీజ్ ​చేశారు. 

కాంగ్రెస్, బీజేపీ రహస్య మైత్రి బయటపడ్డది: హరీశ్

గవర్నర్ ​కోటా ఎమ్మెల్సీల నియామకంతో కాంగ్రెస్, బీజేపీ రహస్య మైత్రి మరోసారి బయట పడిందని మాజీ మంత్రి హరీశ్ ​రావు ‘ఎక్స్’​లో పోస్ట్​ చేశారు. కాంగ్రెస్​ పార్టీకి మేలు చేసేలా గవర్నర్​ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్​ను అణగదొక్కాలని చూస్తున్నాయని, ఈ కుట్రలో గవర్నర్ భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరమని హరీశ్ మండిపడ్డారు. హామీలు అమలు చేయమని అడిగితే మంత్రులు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. గురువారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్  ఫామ్  హౌస్​లో  బీఆర్ఎస్ పార్టీ  పార్లమెంటరీ సమావేశం అనంతరం ఎంపీలు నామా నాగేశ్వర రావు,  రంజిత్ రెడ్డి, దయాకర్ తో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతల మాటలను చూస్తుంటే ఆరుగ్యారెంటీలపై దాటవేత ధోరణి కనిపిస్తోందన్నారు.