ఈ హై స్కూల్లో మూడేండ్లుగా ఒక్క విద్యార్థి లేరు.. టీచర్లే ముగ్గురు రోజూ వచ్చి వెళ్తున్నరు

ఈ హై స్కూల్లో మూడేండ్లుగా ఒక్క విద్యార్థి  లేరు.. టీచర్లే ముగ్గురు  రోజూ వచ్చి వెళ్తున్నరు

తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు ప్రారంభం అయ్యాయి.  విద్యార్థులు ఉత్సాహంగా స్కూళ్లకు వెళుతున్నారు.  సర్కార్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే  బడిబాట  వంటి  కార్యక్రమాలు చేపడుతోంది. అయితే కొన్ని చోట్ల సర్కార్ స్కూల్లో జాయిన్ అయ్యేలా విద్యార్థులను ఆకర్షించలేకపోతుంది ప్రభుత్వం. 

 ఖమ్మం జిల్లా వైరా మండలంలోని అష్ణగుర్తి గ్రామంలో ఉన్న హైస్కూల్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇక్కడ ఒక్క స్టూడెంట్ కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వసతులున్నా సర్కార్ బడుల్లో చేరడానికి ఆసక్తి చూపట్లేదు విద్యార్థులు.  అవును మీరు విన్నది నిజమే అష్ణగుర్తిలో  మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో హైస్కూల్ ఉంది.. ఇక్కడ 600 మందికి పైగా జనాభా ఉన్నా..హైస్కూల్ లో  ఒక్క విద్యార్థి కూడా  జాయిన్ కాలేదు. 

►ALSO READ | విచారణకు వస్తా.. అన్ని విధాలుగా సహకరిస్తా: ఏసీబీ నోటీసులపై స్పందించిన KTR

ఈ సంవత్సరమే కాదు. గత మూడు సంవత్సరాలుగా ఈ హై స్కూల్లో  ఒక్క అడ్మిషన్ కూడా లేదంటే నమ్మశక్యం కావడం లేదు. మూడు సంవత్సరాలుగా ఒక్క స్టూడెంట్  లేరు కానీ..ముగ్గురు ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. హెడ్ మాస్టర్ తో కలిపి మొత్తం ముగ్గురు టీచర్లు ఉన్నారు. రోజు  స్కూల్ కు వచ్చి ఖాళీగా కూర్చుని వెళ్లిపోతున్నారు.  సమ్మర్ లో బడిబాట వంటి కార్యక్రమాలు చేపట్టి..ఇంటింటికి తిరిగినా స్కూల్లో ఒక్క విద్యార్థి చేరడం లేదని..ప్రభుత్వ స్కూళ్లల్లో  విద్యార్థులను జాయిన్ చేసేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు టీచర్లు .