దవాఖాన్ల దత్తతకు సర్కారు యోచన

దవాఖాన్ల దత్తతకు సర్కారు యోచన

డెవలప్ చేసి నచ్చిన పేరు పెట్టుకోవాలంటూ ప్రతిపాదన

హైదరాబాద్, వెలుగు:  ప్రభుత్వ దవాఖాన్లను దత్తతకు ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. దత్తత తీసుకునే వాళ్లు తమకు నచ్చిన పేరు దవాఖానకు పెట్టుకునే వెసులుబాటును కల్పించనుంది.  కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు ఎవరైనా దత్తత తీసుకోవచ్చు. అందులో ఓ బిల్డింగ్ కట్టి, దానికి తమ పేర్లు పెట్టుకోవచ్చు. ఒక ఏడాదికి ఒక వార్డుకు అయ్యే ఖర్చును భరించి, దానికి తమకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఇలా రకరకాల ప్రతిపాదనలతో దాతలను ఆహ్వానించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.  దీనిద్వారా కార్పొరేట్ కంపెనీలు పబ్లిసిటీ పొందే అవకాశం ఉంటుంది.