జాతీయభద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమం విశాఖ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. 55 వ జాతీయ భద్రత వారోత్సవాల కార్యక్రమాలను గజలాపురం విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో నిర్వహించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా మార్చి 1 వ తేదీ నుండి కర్మాగారం లో భద్రతకు సంబంధించి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మార్చి 7 వ తేదీన ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె.వీ.శ్రీదేవి , ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జంగయ్య పాల్గొన్నారు. ఫ్యాక్టరీల్లో కార్మికుల భద్రత గురించి వివరించారు. ఈ సందర్భంగా జరిగిన వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ మేనేజర్ గాయం శ్రీనివాస రెడ్డి, హెచ్ ఆర్ . పెరికెటి నాగార్జున, మాలోతు రవి నాయిక్ , భద్రత అధికారి ఉల్వనీరు శ్రీనయ్య , ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
