జానారెడ్డి అధ్యక్షతన ఫిర్యాదుల పరిష్కార కమిటీ

జానారెడ్డి అధ్యక్షతన ఫిర్యాదుల పరిష్కార కమిటీ

హైదరాబాద్, వెలుగు: సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అధ్యక్షతన ఎంపీ ఎన్నికల్లో పార్టీ నేతల ఫిర్యాదుల పరిష్కారం కోసం కాంగ్రెస్ నేతలతో ఓ కమిటీని సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. శనివారం మీడియాకు ఈ కమిటీ సభ్యుల పేర్లను వెల్లడించారు.  

ఇందులో జానారెడ్డితో పాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ లు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల సందర్భంగా నాయకుల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు ఉన్నా, నేతలపై ఫిర్యాదులు వచ్చినా.. వాటి పరిష్కారం కోసం ఈ కమిటీ పని చేస్తుంది.