గ్రూప్ 1 అప్లికేషన్లకు రెండ్రోజులే గడువు
ఇప్పటికే 2.62 లక్షల దరఖాస్తులు
హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1 దరఖాస్తుల గడువు ఈ నెల31తో ముగియనుంది. అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి ఆదివారం సాయంత్రం వరకు మొత్తం 2,62,590 మంది అప్లై చేసుకున్నారు. కొత్తగా టీఎస్పీఎస్సీ ఓటీఆర్ను 1,59,304 మంది క్రియేట్ చేసుకోగా, పాత ఓటీఆర్ను 3,27,720 మంది అప్డేట్ చేసుకున్నారు. కాగా, మొత్తం అప్లికేషన్లు 3 లక్షలు దాటే అవకాశముందని టీఎస్పీఎస్సీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.