గ్రూప్‌‌‌‌‌‌‌‌ 1 అప్లికేషన్లు 3 లక్షలు దాటే అవకాశం

గ్రూప్‌‌‌‌‌‌‌‌ 1 అప్లికేషన్లు 3 లక్షలు దాటే అవకాశం

గ్రూప్‌‌‌‌‌‌‌‌ 1 అప్లికేషన్లకు రెండ్రోజులే గడువు
ఇప్పటికే 2.62 లక్షల దరఖాస్తులు 

హైదరాబాద్, వెలుగు: గ్రూప్‌‌‌‌‌‌‌‌ 1 దరఖాస్తుల గడువు ఈ నెల31తో ముగియనుంది. అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి ఆదివారం సాయంత్రం వరకు మొత్తం 2,62,590 మంది అప్లై చేసుకున్నారు. కొత్తగా టీఎస్​పీఎస్సీ ఓటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 1,59,304 మంది క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేసుకోగా, పాత ఓటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 3,27,720 మంది అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. కాగా, మొత్తం అప్లికేషన్లు 3 లక్షలు దాటే అవకాశముందని టీఎస్‌‌‌‌‌‌‌‌పీఎస్సీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.