
టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. 2024 జూన్ 9 న గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లుగా వెల్లడించింది. జూన్ 1 మధ్యాహ్నం 2 గంటల నుండి టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో హల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. జూన్ 9వ తేదీ ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు 30 నిమిషాల ముందే అంటే ఉదయం10 గంటలకే పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న గేట్లు మూసివేస్తారని అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుండి ప్రతి పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలెటర్లు అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకుంటారని తెలిపారు. ఆబ్జెక్టివ్ టైపు OMR విధానంలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. శాంపిల్ OMR షిట్ ను టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది.