ఏపీలో గిఫ్ట్ ల గోల: లోకేష్ గుడ్లు - అమర్నాథ్ పప్పు..!

ఏపీలో గిఫ్ట్ ల గోల: లోకేష్ గుడ్లు - అమర్నాథ్ పప్పు..!

తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆంధ్ర ప్రదేశ్ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నారా లోకేష్ శంఖారావం బహిరంగ సభలో ప్రసంగిస్తూ మంత్రి అమర్నాథ్ కి కోడిగుడ్లు గిఫ్ట్ గా పంపిస్తానంటూ సెటైర్ వేశాడు. అందుకు కౌంటర్ గా ఈ రోజు ప్రెస్ మీట్ లో లోకేష్ కి గుడివాడ అమర్నాథ్ పప్పు పంపిస్తానంటూ కామెంట్ చేశాడు. టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులు ఎవరైనా తీసుకెళ్లి లోకేష్ ఇవ్వండంటూ కౌంటర్ ఇచ్చాడు.

అంతే కాకుండా లోకేష్ ఒక బ్యాక్ డోర్ పొలిటీషియన్ అని, 100 లెటర్లు రాస్తే ఉద్యోగాలు రావని ప్రతిభ ఉంటేనే ఉద్యోగాలొస్తాయని, లోకేష్ హయాంలో లెటర్లు రాసి ఎన్ని ఉద్యోగాలు తెప్పించాడో చెప్పాలంటూ ప్రశ్నించాడు. తాను లోకేష్ లాగా బ్యాక్ డోర్ పొలిటీషియన్ కాదని, కష్టపడి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యానని అన్నాడు.

2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీలో పొలిటికల్ హీట్ ఏ రేంజ్ లో ఉందో లోకేష్, అమర్నాథ్ ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని చుస్తే అర్థమవుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఈ రేంజ్ లో పర్సనల్ అటాక్ కి దిగుతున్న నేతలు ముందు ముందు ఇంకెంత దూరం వెళతారో చూడాలి.