
హైదరాబాద్, వెలుగు: సొంత జాగా ఉన్నోళ్లకు రూ.3 లక్షల ఆర్థిక సాయంపై వారంలోగా గైడ్లైన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇటీవల రివ్యూ చేశారని, వారంలోగా గైడ్లైన్స్ రెడీ చేయాలని ఆదేశించారని హౌసింగ్ డిపార్ట్మెంట్కు చెందిన ఓ అధికారి తెలిపారు. గైడ్లైన్స్ ఖరారు అయ్యాక సీఎం కేసీఆర్కు అందచేయనున్నట్లు వెల్లడించారు. అలాగే సొంత జాగాకు సంబంధించి ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న పథకాలపై అధికారులు అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తోంది. పీఎం అవాస్ యోజన స్కీం గైడ్లైన్స్నూ పరిశీలించనున్నట్లు సమాచారం. ముందుగా గ్రామాల్లో సొంత జాగా ఉన్నోళ్ల వివరాలను గ్రామ పంచాయతీ సెక్రటరీలు సేకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.