22 లక్షల దీపాలు..సరయూ నది తీరంలో గిన్నిస్ రికార్డు

22 లక్షల దీపాలు..సరయూ నది తీరంలో గిన్నిస్ రికార్డు

లక్షలాది దీపాల వెలుగుల్లో సరయూ నది తీరం మెరిసిపోయింది. దీపోత్సవంలో భాగంగా 25 వేల మంది వాలంటీర్లు 22 లక్షలకు పైగా దీపాలను వెలిగించారు. 
డ్రోన్ల ద్వారా ఈ దీపాలను లెక్కించిన గిన్నిస్ బుక్ ఆఫ్​ రికార్డ్స్ ప్రతినిధులు.. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ రికార్డని ప్రకటించారు. గిన్నిస్ బుక్​లో నమోదు చేసి సర్టిఫికెట్​ను ఉత్తర ప్రదేశ్ ​సీఎం యోగి ఆదిత్యనాథ్​కు అందజేశారు.