జీటీ క్రికెటర్ రాబిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు యాక్సిడెంట్

జీటీ క్రికెటర్ రాబిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు యాక్సిడెంట్

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గుజరాత్ టైటాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ. 3.6 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన యంగ్ వికెట్ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాబిన్ మింజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గాయపడి హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరాడు. రాంచీలో తన కవాసకి సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వెళ్తున అతను ఎదురుగా వస్తున్న మరో బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టి కింద పడటంతో మోకాలికి గాయాలు అయ్యాయి. రాబిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చిన్న గాయాలే అయ్యాయని, పెద్ద ప్రమాదం ఏమీ లేదని అతని తండ్రి ఫ్రాన్సిస్ తెలిపాడు. ప్రస్తుతం డాక్టర్ల అబ్జర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడని చెప్పాడు.  జార్ఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన రాబిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గత డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన వేలంలో జీటీ  తమ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తీసుకుంది. దాంతో, ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంపికైన తొలి ఆదివాసి క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రాబిన్ రికార్డు సృష్టించాడు.  రాబిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  గుజరాత్ టైటాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరాల్సి ఉంది.