ప్రేగ్ వర్సిటీలో కాల్పులు .. 15 మంది మృతి

ప్రేగ్ వర్సిటీలో కాల్పులు ..  15 మంది మృతి

ప్రేగ్: చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ లోని చార్లెస్ యూనివర్సిటీలో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో 15 మంది మృతి చెందారు. దాదాపు 20  మంది గాయపడ్డారు. గురువారం చార్లెస్ యూనివర్సిటీలోని ఫేకల్టీ ఆఫ్ ఆర్ట్స్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కాల్పులకు తెగబడిన షూటర్ ను చంపేశామని చెప్పారు. యూనివర్సిటీ బిల్డింగ్ ను ఖాళీ చేయిస్తున్నామని పేర్కొన్నారు. వర్సిటీ ప్రాంతాన్ని మొత్తం మూసేశామన్నారు. మళ్లీ ప్రకటించేదాకా సమీప ప్రాంతాల ప్రజలు ఇంట్లోనే ఉండాలని స్థానిక పోలీసులు హెచ్చరించారు.