
గుంటూరు: ఏపీలో హాట్ టాపిక్ అయిన సింగయ్య మృతి కేసులో గుంటూరు పోలీసులు వైసీపీ అధినేత జగన్ సహా మిగతా నిందితులపై బీఎన్ఎస్ 105, 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 105 సెక్షన్ అంటే.. హత్య కిందకు రాని కల్పబుల్ హోమీసైడ్. ఒక వ్యక్తి చావుకు కారణమైనప్పుడు ఈ సెక్షన్ పెడతారు. నేర నిరూపణ జరిగితే ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు విధించొచ్చు. నేర తీవ్రతను బట్టి 5- నుంచి10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. దొరికిన ఆధారాల మేరకు 105 సెక్షన్ కూడా జత చేశారు.
జగన్ కాన్వాయ్ ఒక వృద్ధుడిని నిర్ధాక్షిణ్యంగా తొక్కి చంపేసిందని టీడీపీ, అది ఏఐ వాడుకుని చేసిన కల్పిత వీడియో అని.. ఆ వృద్ధుడు పడింది జగన్ కాన్వాయ్ కింద కాదని వైసీపీ సోషల్ మీడియాలో యుద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. సింగయ్య జగన్ కాన్వాయ్ కింద పడలేదని పోలీసులే చెప్పారని వైసీపీ, వైఎస్ జగన్ కారు కింద సింగయ్య పడినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ నిర్ధారించారని టీడీపీ ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ సమయంలో పోలీసులు జగన్ కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకోవడం, ఈ కేసులో వైసీపీ అధినేత జగన్ను A2 నిందితుడిగా చేర్చడంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మొత్తం ప్రస్తుతం ఈ పరిణామం చుట్టూనే తిరుగుతున్నాయి.
వైసీపీ అధినేత జగన్పై పెట్టిన సెక్షన్లు ఇవే..
* ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ కారు కింద పడి చనిపోయిన సింగయ్య కేసులో కొత్త సెక్షన్లు చేర్చిన గుంటూరు పోలీసులు
* తొలుత BNS 106(1) సెక్షన్ కింద నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణమయ్యారనే కేసు పెట్టగా, తాజాగా BNS 105, 49 సెక్షన్లు జోడించారు.
* హత్య కిందకు రాని నేర విషయాల్లో BNS 105 వాడతారు
* నిరూపణైతే జీవిత ఖైదు/5-10 ఏళ్లు జైలు శిక్ష, ఫైన్ విధించవచ్చు. ఇది నాన్ బెయిలబుల్
* నేరానికి ప్రేరేపించారంటూ BNS 49 సెక్షన్ పెట్టారు.
* జగన్ వాహనం నడిపింది.. ఏఆర్ కానిస్టేబుల్
* ఏపీలో రెంటపాళ్ల పర్యటనలో జగన్ వాహనాన్ని నడిపింది రామిరెడ్డి వెంకటరమణారెడ్డి
* వెంకట రమణారెడ్డి ఏఆర్ కానిస్టేబుల్
* ఏపీఎస్పీ విభాగం నుంచి ప్రకాశం జిల్లాకు ఆర్మ్ రిజర్వ్ విభాగానికి కన్వర్షన్లో వచ్చారు. ఒంగోలులో రిపోర్టు చేసి వెళ్లిపోయారు.
* అప్పటి నుంచి డిప్యుటేషన్లోనే జగన్ దగ్గర కొనసాగుతున్నారు.