అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత..గురుకుల పీఈటీ అభ్యర్థులు అరెస్ట్

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత..గురుకుల పీఈటీ అభ్యర్థులు అరెస్ట్

గురుకుల పీఈటీ అభ్యర్థుల చలో అసెంబ్లీని పోలీసులు అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ 2017 సెప్టెంబర్ లో పరీక్షలు రాసిన PET అభ్యర్థులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. నాలుగేళ్లయినా ఇప్పటివరకు ఫలితాలు విడుదల చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రాక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. హైకోర్టు స్టే ఎత్తివేసినా నియామకాలు చేపట్టకపోవడంతో దారుణమన్నారు PET అభ్యర్థులు. అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు పోలీసులు.