రూ.20 కోట్ల అప్పు..ఆ ఏడుగురి ప్రాణాలు తీసింది:డబ్బుల కోసం చంపేస్తామని బెదిరింపులు

రూ.20 కోట్ల అప్పు..ఆ ఏడుగురి ప్రాణాలు తీసింది:డబ్బుల కోసం చంపేస్తామని బెదిరింపులు

బిజినెస్లో లాస్ రావడంతో ఓ కుటుంబం వీధిన పడింది. దీనికితోడు అప్పుల బాధ..ఊరు వదిలి కొన్నేళ్లు వేరే ప్రాంతానికి వెళ్లి బతకాలనుకున్నారు..అయినా ఆ కుటుంబాన్ని అప్పులిచ్చిన బ్యాంకులు, మనీ లెండర్లు వదల్లేదు..చేసేదేమీ లేక చివరికి ఆ కుటుంబం మొత్తం ఊకుమ్మడిగా ప్రాణాలు తీసుకుంది. హర్యానాలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇటీవల బయటికి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. 

ఆదివారం (మే25) హర్యానాలోని పంచకులలో ఓ కుటుంబానికి చెందిన ఏడుగురు ఇంటిబయట నిలిపి ఉంచిన కారులో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ కుటుంబ హిసార్‌ బార్వాలాకు చెందిన ప్రవీణ్ కుటుంబంగా  పోలీసులు, బంధువులు గుర్తించారు. హిస్పార్ లోని బాల్వారాకు చెందిన ప్రవీణ్ తన కుటుంబం కలిసి పన్నేండేళ్లక్రితం పంచకులకు బతుకుదెరువు కోసం వచ్చారు.

 ప్రవీణ్..హిమాచల్ ప్రదేశ్ లో ఓస్క్రాప్ ఫ్యాక్టరీ ని నడుపుతున్నాడు. ఫ్యాక్టరీ నష్టాల్లో నడవడంతో దాదాపు రూ. 20కోట్లకు పైగా బ్యాంకు, ఇతర మనీలెండర్లనుంచి అప్పులు చేశాడు. అప్పులు కట్టలేని పరిస్థితిలో ప్రవీణ్ వారి కంటపడకుండా తిరుగుతున్నాడు. ఈక్రమంలో వారిని చంపుతామని బెదిరింపులు రావడం ప్రవీణ్ కుటుంబాన్ని ఆందోళనకు గురిచేసింది. 

అప్పులు చెల్లించకపోవడంతో ఫ్యాక్టరీతోపాటు , తన రెండు ప్లాట్లు, ఇతర ఆస్తులు బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  పెరుగుతున్న అప్పుల కారణంగా ప్రవీణ్ హిసార్ వదిలి డెహ్రడూన్ కు ఫ్యామిలీ షిఫ్ట్ చేశాడు. 

పంచుకులలోని సాకేత్రి గ్రామంలో నివాసం ఉంటూ ప్రవీణ్ ట్యా్క్సీ నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. అయితే పెరుగుతున్న అప్పుల కారణంగా వేధింపులు తాళలేక పంచకులలోని ప్రవీణ్ ఇంటి బయట నిలిపి ఉంచిన కారులోనే కుటుంబంలోని ఏడుగురు సభ్యులు విషం తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు బయటికి తీయగా ఆరుగురు స్పాట్ లోనే చనిపోయాడు.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. 

ఆదివారం పంచకులలో ప్రవీణ్ కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. అప్పుల బాధ తాళలేకనే ప్రవీణ్ కుటుంబం ఊకుమ్మడి ఆత్మహత్య కు పాల్పడిందని, తమకు అంత్యక్రియలు జరపాల్సిందిగా సూసైడ్ నోట్ లో కోరారని ప్రవీణ్ బంధువు ఒకరు మీడియాకు తెలిపారు.