రేంజర్ల రాజేష్పై కేసు నమోదు చేయాలె

రేంజర్ల రాజేష్పై కేసు నమోదు చేయాలె

హిందు దేవుళ్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని హైందవ ధర్మ రక్షక్ దళ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. ప్రశాంతంగా ఉన్న మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు.

బైరి నరేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. రేంజర్ల రాజేష్ పై ఎందుకు కేసు నమోదు చేయలేదని వారు ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసే విధంగా పోలీస్ శాఖను ఆదేశించాలని హైదవ ధర్మ రక్షక్ దళ్ ప్రతినిధులు కమిషన్ ను కోరారు.