ముంబైలో కిడ్నాపైన బాలుడి అప్పగింత

ముంబైలో కిడ్నాపైన బాలుడి అప్పగింత

కరీంనగర్ టౌన్, వెలుగు: కిడ్నాప్​ అయిన బాలున్ని కరీంనగర్ టాస్క్​ఫోర్స్​ ఆఫీసర్లు శుక్రవారం ముంబై పోలీసులకు అప్పగించారు. జగిత్యాల జిల్లా బుగ్గారానికి చెందిన డిష్​ టెక్నిషియన్, తన పాత స్నేహితుడితో కలిసి ఆగస్టు31నముంబైలోని బాంద్రా ఏరియాలో బాలున్ని కిడ్నాప్​ చేసి తీసుకొచ్చాడు. బాంద్రా పోలీసుల సమాచారంతో కరీంనగర్​ టాస్క్​ఫోర్స్​బృందం నిందితులను గుర్తించి గురువారం అదుపులోకి తీసుకుంది. బాలుడు  క్షేమంగా ఉన్నాడని తెలియచేయడంతో శుక్రవారం ముంబై పోలీసులు కరీంనగర్​కు వచ్చారు. బాలున్ని అడిషనల్ డీసీపీ(అడ్మిన్)జి.చంద్రమోహన్ వారికి అప్పగించారు. వేగంగా స్పందించి కేసును సాల్వ్​చేసిన  టాస్క్ ఫోర్స్ సీఐలు మల్లయ్య,సృజన్ రెడ్డిలను డీజీపీ మహేందర్​రెడ్డి, కరీంనగర్​సీపీ సత్యనారాయణ అభినందించారు.